మహానటి, సైరా నరసింహారెడ్డి, ఖైదీ నంబర్ 150, ఆర్ఆర్ఆర్ తోపాటు ఎన్నో హిట్ చిత్రాలకు డైలాగ్స్ అందించారు సాయిమాధవ్ బుర్రా. ఈ స్టార్ రైటర్ మరో క్రేజీ ప్రాజెక్టుకు సంభాషణలు రాయబోతున్నారు. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏంటో తెలుసా..? శంకర్, రాంచరణ్ కాంబోలో వస్తున్న సినిమా. శంకర్ తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ..ఆయనతో పనిచేయడం చాలా ఎక్జయిటింగ్ గా ఉందంటున్నారు. శంకర్ సినిమాలంటే సామాజిక సమస్యలపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు.
మరి ఈ సారి శంకర్ తీయబోతున్న బై లింగ్యువల్ ప్రాజెక్టు తెలుగు వెర్షన్ కు సాయిమాధవ్ బుర్రా సంభాషణ అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా స్టార్ డైరెక్టర్ శంకర్ తో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను ..అని ట్వీట్ చేశారు సాయి మాధవ్ బుర్రా.
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సాయిమాధవ్ బుర్రా ఎలాంటి సంభాషణలు అందించబోతున్నారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ లో ఎవరు కనిపిస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
బీచ్లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి