టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ క్రిష్ (krish)దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్టు కొండపొలం. ఈ సినిమా నుంచి ఓబులమ్మా పాటను మేకర్స్ విడుదల చేశారు. ఓ ఓ ఓబులమ్మా..బుట్ట చెండు ఆటలోనా పూల కొమ్మా అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. గొర్రెల కాపరిగా కనిపిస్తున్న వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) ఓ ఓ ఓబులమ్మా అంటూ పాట పడుతుంటే…మరోవైపు గ్రామీణ యువతిగా లంగావోణిలో కనిపిస్తున్న రకుల్ ప్రీత్సింగ్ (Rakul Preet Singh) రోలు తిప్పుతూ ఈ పాటకు గొంతు కలిపింది.
వైష్ణవ్ తేజ్, రకుల్ మధ్య సాగే ఈ లవ్ ట్రాక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంఎం కీరవాణి సంగీతం ఈ పాటకు జీవం పోసిందని వీడియో సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ఈ పాటను ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాయగా..సత్య యామిణి, పీవీఎన్ ఎస్ రోహిత్ పాడారు.
రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఫారెస్ట్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ పాత్రలో నటిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ