టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మిగిలిన షూట్ కు సంబంధించి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. రెండింటిలో ఒక పాటను ఉక్రెయిన్ లో చిత్రీకరించనుందట జక్కన్న టీం. ఎన్టీఆర్, ఒలివియా మొర్రిస్ మధ్య వచ్చే డ్యుయట్ సాంగ్ కోసం రాజమౌళి ఉక్రెయిన్ లోని కొన్ని లొకేషన్లను ఫైనలైజ్ చేసినట్టు టాక్.
ఆగస్టులో ఈ పాటను షూట్ చేయనుండగా..దీని కోసం వచ్చే నెల మొదటి వారంలో రాజమౌళి టీం ఉక్రెయిన్ వెళ్లనున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. మరో పాటను హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో షూట్ చేయనుంది టీం. ఈ పాట చిత్రీకరణలో ఎన్టీఆర్, రాంచరణ్, అలియాభట్ కలిసి పాల్గొననున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Recommended Content by ntnews.com