టాలీవుడ్లో వారసుల హవా నడుస్తూనే ఉంది.పాత తరం నటీనటుల వారసులు ఇప్పుడు హీరోలుగా ఇండస్ట్రీలో రాణిస్తుండగా, ఇప్పుడు వారి పిల్లలు కూడా సిల్వర్ స్క్రీన్పై సందడి చేస్తున్నారు. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనయుడు కూడా వెండితెర ఆరంగేట్రం చేయబోతున్నట్టు తెలుస్తుంది. గుణశేఖర్ తన చిత్రం ద్వారా అభయ్ రామ్ లేదా భార్గవ్ రామ్ ఇద్దరిలో ఒకరిని వెండితెరకు పరిచయం చేయనున్నాడట.
స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం దుష్యంతుడు- శకుంతల ప్రేమకథ ఆధారంగా శాకుంతలం అనే పీరియాడికల్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో శకుంతల పాత్రలో సమంత, గుణశేఖర్ పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. శాకుంతలం కొడుకు భరత్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ని అనుకుంటున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే అల్లు అర్జున్ తనయుడు అయాన్ని సంప్రదిస్తారనే టాక్ నడుస్తుంది. అయాన్ ఇప్పటికే అల వైకుంఠపురములో ప్రమోషన్ సాంగ్లో కనిపించిన విషయం తెలిసిందే. శాకుంతలం చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ కుమార్తె నీలిమ నిర్మిస్తోంది.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.