టాలీవుడ్ స్టార్ హీరో లాంబోర్గిని ఉరుస్ గ్రాఫిటే క్యాప్సుల్ కారుని కొన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య లగ్జరీ కారులో రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్టు వార్తలు రాగా, దానిని ఎన్టీఆర్ పీఆర్ఓ ఖండించారు. అయితే సోమవారం ఇండియాలో ఈ కారు లాంచ్ కాగా, బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్కి చేరింది. ఈ కారుని 3.16 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ కొనుగోలు చేసినట్టు సమాచారం.
బుధవారం ఎన్టీఆర్ ఉక్రెయిన్ నుండి హైదరాబాద్కి తిరిగి రాగా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి తన ఇంటికి లాంబోర్గిని ఉరుస్ కారులోనే ప్రయాణించినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ తన లగ్జరీ కారులో ప్రయాణించే సమయంలో కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. మనదేశంలో ఈ ఖరీదైన కారుని కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా ఎన్టీఆర్ నిలిచాడు. ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థయే ‘లంబోర్ఘిని’. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఈ కార్లను ఉత్పత్తి చేయగా.. ఇండియాలో సోమవారం రోజున దీనిని అధికారింగా లాంచ్ చేశారు.
ఈ కారులో200 కిమీ వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. ఇందులో ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉండటంతో ఎదురుగా వాహనాలు ఉంటే అలర్ట్ చేస్తుందట. ఆటోమేటేడ్ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, కానీ డోర్లు కానీ అంత ఈజీ తెరచుకోవట. ఫుల్లీ ఆటోమెటెడ్, సెఫ్టీతో లంబోర్ఘినిని తయారు చేశారు. కాగా, ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజ్ 20పైగా కార్లు ఉన్నాయి.