కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన నటులకు కరోనా అని తెలుసుకొని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొందరు అయితే దేవాలయాలకు వెళ్లి త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. మొన్నామధ్ పవన్ కళ్యాణ్కు కరోనా అని తెలిసి ఆయన అభిమానులు కోలుకోవాలంటూ పూజలు చేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
‘మా నందమూరి తారకరామారావు గారు కోవిడ్ నుంచి తొందరగా కోలుకోవాలని ఈ రోజు తిరుపతిలో దేవాలయానికి, మసీదుకు, చర్చికి వెళ్లి మత ప్రార్థనలు చెయ్యడం జరిగింది’ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూజ జరిపించిన విజువల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ మే 10న కరోనా బారిన పడగా, ఇటీవల తన ఆరోగ్యం బాగానే ఉందని ట్వీట్ చేశారు.ఇక మే 20న జూనియర్ బర్త్ డే కావడంతో ఆ సమయానికి పూర్తిగా కోలుకొని అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.