చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు చిత్ర విచిత్ర వేషధారణలు, వినూత్న చర్యలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ బంధువైన టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్రా కగం (ఏఎంఎంకే) పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఆ పార్టీ నుంచి రామనాథపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థి జి.మునియసామి ఆదివారం రామేశ్వరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ గెటప్లో స్థానికులను ఆకట్టుకున్నారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.