మోటకొండూర్, మే 10: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని చందేపల్లి గ్రామంలో పాలకవర్గం, అఖిలపక్షం నాయకులు, వ్యాపారుస్తులు సోమవారం నుంచి సుమారు 21 రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ చేపట్టనున్నారు. ఈ మేరకు 10వ తేది నుంచి ఈ నెల 30వ తేది వరకు లాక్ డౌన్ కొనసాగించాలని గ్రామస్తులతో కలిసి తీర్మానించారు. ఈ 21 రోజులు గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు లాక్డౌన్ ఉంటుందని సర్పంచ్ దూదిపాల మున్ని తె లిపారు. కరోనా సెకండ్ సేవ్ చాలా ప్రమాదకరంగా ఉన్నం దున లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నామని, స్వచ్ఛంద లాక్డౌన్ కు గ్రామస్తులంతా సహకరించాలని కోరారు.
రాజాపేట,: రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మండల కేంద్రంలో స్వచ్ఛందంగా తలపెట్టిన లాక్డౌన్ రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల అ నంతరం వ్యాపారులు తమ దుకాణాలు మూసివేశారు.
నేటి నుంచి బీబీనగర్ మండల కేంద్రంలో
కొవిడ్ కట్టడిలో భాగంగా బీబీనగర్ మండల కేం ద్రంలో నేటి నుంచి ఈ నెల 23 వరకు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించనున్నట్టు సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి తెలిపారు. సోమవారం సర్పంచ్, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పం చాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీ సుకున్నారు. బీబీనగర్ పట్టణ పరిధిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి దుకాణదారులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత తమ దుకాణాలు మూసివేసి స్వచ్ఛంద లాక్ డౌన్కు సహకరించాలని కోరారు.గ్రామస్తులు ఎవరూ బహిరం గ ప్రదేశాల్లో తిరగొద్దని, ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించి భౌ తిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దస్తగిరి, మంగ అశోక్, వార్డు సభ్యులు అంజి, బెండె ప్రవీణ్, ఆంజనేయ శర్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.