ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బేబీ’ చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సాయిరాజేష్ దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్నివ్వగా, అగ్ర దర్శకుడు సుకుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 20 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని, వినూత్న ప్రేమకథా చిత్రమిదని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్రెడ్డి, సంగీతం: విజయ్ బుల్గానిన్, ఆర్ట్: సురేష్, రచన-దర్శకత్వం: సాయిరాజేష్.