ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ చిత్రాలకు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం డేనియల్ క్రేగ్ బాండ్గా రూపొందుతున్న నో టైమ్ టూ డై చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. థియేటర్లు తెరచుకున్నాకా విడుదలైన ‘షాంఘ్ ఛీ’, ‘ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ చిత్రాలకు మనదేశంలో మంచి ఆదరణ లభించడంతో ‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1700 థియేటర్స్లో చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ చేస్తుండగా, అక్టోబరు 1 తర్వాత మహారాష్ట్రలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకుంటే ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30న చిత్రాన్ని 2డీ, త్రీడీ, 4డీలో విడుదల చేస్తున్నారు. తెలుగు,తమిళం,హిందీ,కన్నడ,ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
బాండ్ సిరీస్ నుంచి 24 చిత్రాలు వెండితెరపై సందడి చేయగా.. ఇప్పుడు 25వ చిత్రంగా ‘నో టైమ్ టు డై’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విలన్ సఫీన్గా రామి మాలెక్ ఇందులో నటిస్తున్నారు. కారీ జోజి దర్శకుడు. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. అమెరికాలో అక్టోబరు 8న ‘నో టైమ్ టు డై’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా, ఇందులోని యాక్షన్ సన్నివేశాలతో సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది.