న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు గత 25 రోజుల నుంచి 5 శాతం లోపే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. రోజువారీగా పాజిటివిటీ రేటు అదుపులో ఉన్నట్లు ఆయన తెలిపారు. గత వారంతో పోలిస్తే ఈ వారం కోవిడ్ కేసుల్లో 13 శాతం తరుగుదల కనిపించిందన్నారు. సగటును ప్రతి రోజూ దేశవ్యాప్తంగా 46వేల పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. యాక్టివ్ కేసులు 86 శాతం తగ్గినట్లు చెప్పారు. మే 3వ తేదీన 81.1 శాతంగా ఉన్న రికవరీ రేటు ఇప్పుడు 97 శాతానికి చేరినట్లు తెలిపారు.