జాతీయ జెండాలను ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు
రాష్ర్టాభివృద్ధిలో పోలీసుల భాగస్వామ్యం కీలకం ఎస్పీ ఏవీ రంగనాథ్
నీలగిరి/ నల్లగొండ రూరల్/ కనగల్/ తిప్పర్తి, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వాడవాడలా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. నల్లగొండలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ రంగనాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పోలీసులు కీలక పాత్ర పోషించారని, శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలో మనమే అగ్రస్థానంలో ఉన్నామని అన్నారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా ప్రజలకు సేవలందిస్తామని పేర్కొన్నారు. పలు పోలీస్ కార్యాలయాల్లో జాతీయ పతాకం రెపరెపలాడింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ నర్మద, ఆర్ముడ్ రిజర్వు హెడ్క్వార్టర్లో ఏఆర్ అదనపు డీఎస్పీ సురేశ్కుమార్, జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో డీటీసీ అదనపు ఎస్పీ సతీశ్, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ నిగిడాల సురేశ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఐ అనిల్, టూటౌన్ సీఐ కార్యాలయంలో సీఐ చంద్రశేఖర్రెడ్డి, టూటౌన్లో నర్సింహ, రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజశేఖర్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎస్బీ డీఎస్పీ రమణారెడ్డి, రవీందర్, సీఐలు రౌతు గోపి, ఆర్ఐలు నర్సింహాచారి, స్పర్జన్రాజ్, కృష్ణారావు, నర్సింహ, ఏఓ మంజు భార్గవి, పోలీస్ అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. 12వ బెటాలియన్లో కమాండెంట్ ఎన్వీ సాంబయ్య జెండా ఎగురవేశారు.
మున్సిపాలిటీలో…
నల్లగొండ మున్సిపల్ కార్యాలయం లో చైర్మన్ మందడి సైదిరెడ్డి జెండావిష్కరణ చేయగా కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర, కౌన్సిలర్లు పిల్లి రామరాజు, గోగుల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, ఉట్కూరి వెంకట్రెడ్డి, మారగోని గణేశ్, యామ దయాకర్, కొండూరు సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. జడ్పీ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు జెండాను ఆవిష్కరించగా సీఈఓ వీరబ్రహ్మచారి, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, రాంబాబు పాల్గొన్నారు. టీఎన్జీవోస్ భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రావణ్కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ కార్యాలయంలో…
టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారిని గుర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, పార్టీ పట్టణాధ్యకార్యదర్శులు రామరాజు, దేవేందర్, ఐసీడీఎస్ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మల్లికార్జున్రెడ్డి, ఎండీ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. జిల్లా జైలులో సూపరింటెండెంట్ ఎం.దేవ్లానాయక్ జెండా ఎగువేశారు. డీఎస్టీఓ కళాసాగర్, జైలర్ అనిల్కుమార్ పాల్గొన్నారు.
నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మనిమద్దె సుమన్, కనగల్ తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ శ్రీనివాస్రావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సోమసుందర్రెడ్డి, ఎంపీపీ కరీంపాషా, తిప్పర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ కృష్ణయ్య జెండాను ఆవిష్కరించారు.
దేశాభివృద్ధిలో విద్య ప్రధానపాత్ర
ఎంజీయూ వీసీ గోపాల్రెడ్డి
రామగిరి : దేశాభివృద్ధిలో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుందని ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంజీయూలో జాతీయ జెండా ఆవిష్కరించారు.
నల్లగొండలోని గడియారం సెంటర్లో ఉన్న కాసోజు శ్రీకాంతాచారి విగ్రహం వద్ద విశ్వబ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి నివాళి అర్పించారు. కాసోజు శంకరాచారి, యువజన సంఘం ప్రతినిధులు హరికృష్ణ, విజయ్కుమార్, రమేశ్, నిఖిల్ పాల్గొన్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో…
కట్టంగూర్/ నార్కట్పల్లి/ చిట్యాల/ శాలిగౌరారం/ కేతేపల్లి : నకిరేకల్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసి జాతీయగీతం, తెలంగాణ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సీఐ నాగరాజు, శాలిగౌరారం సీఐ పసుపులేటి నాగాదుర్గాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నడికుడి ఉమారాణి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మురారిశెట్టి ఉమారాణి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. కట్టంగూర్ మండలంలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, జడ్పీటీసీ తరాల బలరాములు, తాసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ సునీత, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైద్యాధికారి వెంపటి కల్పన, ఏఓ శ్రీనివాస్, ట్రాన్స్కో ఏఈ సురేశ్, ఎస్ఐ బత్తుల శివప్రసాద్, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు పాల్గొన్నారు.
నార్కట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి జెండా ఎగురవేవారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, దుబ్బాక పావని శ్రీధర్, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సాంబశివరావు, ఏఈ మోహన్, ఎంపీఓ సత్యనారాయన ఏపీఓ యాదయ్యలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిగూడెంలో ఉపాధి హామీ కూలీలకు స్వీట్లు, మిఠాయిలు ఆ గ్రామ సర్పంచ్ మేడి పుష్పలతాశంకర్ పంపిణీ చేశారు. వార్డు సభ్యులు దండు లక్ష్మి, మేడి శంకర్, మేడి రమేశ్, దండు జగన్ పాల్గొన్నారు.
చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చినవెంకట్రెడ్డి, మండల పరిషత్లో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, పోలీస్స్టేషన్లో సీఐ శంకర్రెడ్డి, తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ కృష్ణారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు అంతటి వెంకటేశ్, బుర్రి రవీందర్రెడ్డి, రత్నం పుష్పానర్సింహ, పాలెం మాధవి, కంచర్ల శ్రీనివాసరెడ్డి, ఈసం బాబు తదితరులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. శాలిగౌరారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గంట లక్ష్మమ్మ, తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్పర్సన్ కట్టా లక్ష్మివెంకట్రెడ్డి, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ తాళ్ళూరి మురళి, వ్యవసాయ కార్యాలయంలో ఏఓ సౌమ్యశృతి జాతీయ జెండాలను ఎగుర వేశారు. కార్యక్రమాల్లో వైస్ చైర్మెన్ గుజిలాల్ శేఖర్బాబు పాల్గొన్నారు. కేతేపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, తాసీల్దార్ వెంకటేశ్వర్లు, సర్పంచులు పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో…
మునుగోడు/ మర్రిగూడ/ నాంపల్లి : మునుగోడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ కర్నాటి స్వామి జాతీయజెండాను ఎగురవేసి మాట్లాడారు. ఎంతోమంది విద్యార్థులు, ఉద్యమవీరుల పోరాట ఫలితం వల్లే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, ఎంపీడీఓ యాకూబ్నాయక్, తాసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎస్ఐ రజనీకర్, ఏఓ సూదగాని శ్రీనివాస్గౌడ్, ఏపీఎం శ్రీదేవి, ఏపీఓ శ్రీనయ్య పాల్గొన్నారు. చండూరు మండల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ పల్లె కళ్యాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తోకల చంద్రకళ జెండా ఆవిష్కరించారు. మర్రిగూడ మండలంలో ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, సీఐ సత్యం, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేశ్గౌడ్, ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్, ఏఓ స్పందన, ఉప తాసీల్దార్ తారకరామన్, ఎంపీఓ ఝాన్సీరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు. మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు దంటు జగదీశ్వర్, మండల ప్రధాన కార్యదర్శులు లపంగి నర్సింహ, పందుల రాములుగౌడ్, ఉపాధ్యక్షులు రామన్న, పాండుగౌడ్, గ్రామాధ్యక్షుడు యాదయ్య, గోపీనాయక్, కృష్ణ, నాయకులు పాల్గొన్నారు. నాంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత జాతీయ జెండాను ఎగురవేశారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి పాల్గొన్నారు.