నేటి నుంచి 43వ జూనియర్ రాష్ట్ర స్థాయి బాలికల హ్యాండ్బాల్ టోర్నీ
పాల్గొననున్న పది జిల్లాల క్రీడాకారులు
మహబూబ్నగర్ టౌన్, మార్చి 24 : నేటి నుంచి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో హ్యాండ్బాల్ టోర్నీ నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు 43వ జూనియర్ రాష్ట్ర స్థాయి బాలికల హ్యాండ్బాల్ టోర్నీ జరగనున్నది. స్థానిక శ్రీరామ ల్యాండ్మార్క్లోని పాలమూరు స్పోర్ట్స్ అకాడమీలో టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు, 40 మంది అఫీషియల్స్ టోర్నీలో పాల్గొననున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నట్లు జిల్లా హ్యాండ్బాల్ సెక్రటరీ మహ్మద్ జియాఉద్దీన్ తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ నెల 26న ముగించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా బాలికల జట్టు..
గాయత్రి, దివ్య, భవ్య, రోజా, మౌనిక, శైలజ, పావని, సౌమ్యగౌడ్, జే.రాధిక, జి.రాధిక, నవిత, శైలు, నూర్జహాన్, సనా తబస్సుమ్, చందన, మానస, కోచ్ మేనేజర్లు ప్రదీప్, ఆసిఫ్.