న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో భారత్ కు విమానాల రాకపోకలను హాంకాంగ్ మంగళవారం నుంచి మే 3 వరకూ రద్దు చేసింది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ల మధ్య తిరిగే విమానాలను మే 3 వరకూ రెండు వారాల పాటు నిలిపివేసింది.
విస్తారా విమానాల నుంచి ఇటీవల తమ దేశానికి వచ్చిన ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించగా 50 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం ఇక నుంచి హాంకాంగ్ రాదలుచుకున్న వారందరూ విధిగా కొవిడ్ పరీక్షకు సంబంధించి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ కలిగిఉండాలి.