నార్కట్పల్లి, మార్చి 29: మండలంలోని అక్కెనపల్లిలో సాలగ్రామ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన అర్చకుడు కృష్ణ మా చార్యులు ఆధ్వర్యంలో సోమవారం కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అనువంశిక చైర్మన్ సుదర్శన్రెడ్డి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, భక్తులు పాల్గొన్నారు.
తీదేడులో రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
మాల్: చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో గల శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం సర్పంచ్ కాయితి జితేందర్రెడ్డితోపాటు పలువురు స్వామి వారికి ప్రత్యేకాభిషేకాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ధరణపతి రమణారావు, మాజీ సర్పంచ్ దాసరి శ్రీనివాస్ యాదవ్ అర్చకులు పాల్గొన్నారు.
నేటి నుంచి మాల్లో ..
చింతపల్లి మండలంలోని గొడకొండ్ల, వెంకటేశ్వరనగర్, (మాల్)లో గల గుట్టపైన అలివేలుమంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ఏప్రిల్ 3వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వూరె లక్ష్మణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2న నిర్వహించే రథోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ కూడా చదవండి..
వొడాఫోన్ తర్వాత కెయిర్న్కు వ్యతిరేకంగా హేగ్ కోర్టుకు భారత్!