పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్కుంద్రాను పోలీసులు అనేక కోణాలలో విచారిస్తుండడంతో పాటు ఆయన భార్యతో పాటు బంధువులని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక పలువురు వీరిపై కేసులు పెట్టడంతో కేసులు కూడా నమోదు చేస్తున్నారు. తాజాగా శిల్పా, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ హజరత్గంజ్, విభూతిఖండ్ పోలీస్ స్టేషన్లలో వారిపై కేసు పెట్టారు.
ఈ క్రమంలో పోలీసుల రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్ సుమన్ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ, ఒక బృందం ముంబై చేరుకుంది. వివరాలలోకి వెళితే శిల్పాశెట్టి అయోసిస్ వెల్నెస్ అండ్ స్పా పేరుతో ఫిటినెస్ సెంటర్ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆమె చైర్మన్గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ఈ ఫిట్నెస్ సెంటర్ మరో బ్రాంచ్ను లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరికి వారు ఫ్రాంచెజ్ ఇచ్చి, సెంటర్ను ప్రారంభించేందుకు వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. మనీ తీసుకున్న తర్వాత వారి దగ్గర నుండి ఏ రెస్పాన్స్ లేదు. ఈ నేపథ్యంలో శిల్పా ఆమె తల్లి మమ్మల్ని మోసం చేశారని పోలీసులని ఆశ్రయించారు బాధితులు. పోలీసులు ఈ కేసుని నిశితంగా పరిశీలిస్తున్నారు.