ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కిరాతక’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఎం.వీరభద్రం దర్శకుడు. విజన్ సినిమాస్ పతాకంపై డా॥ నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్రాజ్పుత్ కథానాయికగా నటించనుంది. తొలిసారిగా ఆదిసాయికుమార్తో ఈ భామ జోడీ కట్టబోతున్నది. ఈ చిత్రం త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ విభిన్న క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించబోతున్నాం’ అన్నారు. త్వరలో షూటింగ్ను ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ్రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: తిర్మల్రెడ్డి యాళ్ల, నిర్మాత: నాగం తిరుపతిరెడ్డి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎం.వీరభద్రం.