కోలా బాలకృష్ణ, సాక్షిచౌదరి జంటగా రూపొందిన చిత్రం ‘నేనెవరు’. నిర్ణయ్ పల్నాటి దర్శకుడు. భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మాతలు. డిసెంబరు 2న చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది. హీరో కోలా బాలకృష్ణకు ఈ చిత్రం మంచి గుర్తింపును తెస్తుంది’ అన్నారు.