అభిరామ్వర్మ, సాత్వికరాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నీతో’. బాలుశర్మ దర్శకుడు. ఏవీఆర్ స్వామి, ఎం.ఆర్ కీర్తన, స్నేహాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను ఆదివారం హైదరాబాద్లో హీరో విశ్వక్సేన్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘టీజర్ నచ్చి ఈ వేడుకకు వచ్చాను. నా దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమాలు ఉండవు. విజయవంతమైన ప్రతి సినిమా పెద్దదే. ఆ లక్షణాలన్నీ ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘రొటీన్కు భిన్నంగా సాగే పట్టణ నేపథ్య ప్రేమకథ ఇది. ఓ జంట ప్రణయప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. వరుణ్ ఎవరు? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్నది ఆకట్టుకుంటుంది’ అన్నారు.