నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 3 : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిం చారు. గురువారం బోధన్లోని ప్రభుత్వ దవాఖానలో 24 మందికి టెస్టులు నిర్వహించగా ఇద్దరికి, రాకాసీపేట్ అర్బన్హెల్త్ సెంటర్లో ఏడుగురికి టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు. పాన్గల్లీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 16 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింద న్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 11మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిం దని సదరు దవాఖాన సిబ్బంది తెలిపారు. బోధన్ మండలంలోని సాలూరా పీహెచ్సీలో పలువురికి టెస్టులు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ వచ్చిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో 20 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ రవికుమార్ తెలిపారు. రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి చెక్పోస్టు వద్ద గురువారం 74 మందికి కొవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ వచ్చిందని వైద్యసిబ్బంది తెలిపారు. భీమ్గల్ పీహెచ్సీలో 75 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖాన, హౌసింగ్ బోర్డు పీహెచ్సీ, దేగాం పీహెచ్సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్, స్వాతి వినూత్న, అమృత్రాంరెడ్డి తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలో ఒకరికి, హౌసింగ్ బోర్డు పీహెచ్సీలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. డిచ్పల్లిలోని 30 పడకల దవాఖానలో కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరిత తెలిపారు. 23 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 23 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..అందరికీ నెగెటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ రఘువీర్ తెలిపారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 19 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చగా.. అందరికీ నెగెటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఏడుగురికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు. కోటగిరి మండ లంలోని పొతంగల్ పీహెచ్సీ పరిధిలో 158 మందికి, కోటగిరి సీహెచ్సీలో 50 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరరికీ నెగెటివ్ వచ్చినట్లు డాక్టర్ సమత తెలిపారు. వర్ని మండలకేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో గురువారం 26 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మోస్రా మండల కేంద్రంలో కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 46 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ దిలీప్ తెలిపారు.