కల్హేర్/సిర్గాపూర్, మే 10 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని కల్హేర్, సిర్గాపూర్ జడ్పీటీసీలు నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి అన్నారు. సోమవారం రెండు మండలాల్లో ముస్లింలకు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కృషితో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో సిర్గాపూర్ ఎంపీపీ మైపాల్రెడ్డి, కల్హేర్ తహసీల్దార్ జైరాం, మార్డి పీఏసీఎస్ మాజీ చైర్మన్ జలంధర్, సిర్గాపూర్ డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, తెలంగాణ జాగృతి జిల్లా యువజన అధ్యక్షుడు అరుణ్రాజ్, కల్హేర్ ఎంపీటీసీ సంగప్ప, కో-ఆప్షన్ మెంబర్ ఘని, టీఆర్ఎస్ సిర్గాపూర్ మండల అధ్యక్షుడు సంజీవ్రావు, యువజన సంఘం మండల అధ్యక్షుడు సంతోశ్కుమార్, నాయకులు పాల్గొన్నారు.
రంజాన్ కానుకల అందజేత
రంజాన్ పండుగకు సంబంధించిన కానుకలను ముస్లిం సోదరులకు అందజేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి మండలానికి చెందిన 300 మందికి కొత్త బట్టలను ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరస్వామిగౌడ్, రెవెన్యూ సిబ్బంది సద్దిరాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నరేందర్, ఆసిఫ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్..
న్యాల్కల్ మండలం మిర్జాపూర్(బీ) గ్రామంలో ముస్లింలకు రంజాన్ కానుకలు టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఇమ్రాన్, వాజీద్, మల్లికార్జున్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.