శివ దర్వకత్వంలో రజనీకాంత్, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం అన్నాత్తె. దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ, కరోనా వలన కొద్ది రోజులు, రజనీకాంత్ ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్ని రోజులు ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది.
రామోజీ ఫిలిం సిటీలో అన్నాత్తె చిత్ర షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుండగా, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని చిత్రీకరణ జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ టీంతో జాయిన్ కాగా, మంగళవారం నయనతార హైదరాబాద్లో అడగుపెట్టింది. ఎయిర్పోర్ట్లో లాండ్ అయిన వెంటనే… అక్కడ నుంచి నేరుగా ఫిల్మ్ స్టూడియోకి వెళ్లారు. ‘చంద్రముఖి’, ‘దర్బార్’ చిత్రాల్లో కథానాయికగా, ‘శివాజి’, ‘కథానాయకుడు’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో రజనీకాంత్తో కలిసి నటిస్తుంది నయనతార.చిత్రంలో జగపతి బాబు విలన్గా నటించనుండగా, ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
ఇవికూడా చదవండి..