న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తయారీపై ఇస్రో కీలక నిర్ణయం తీసుకున్నది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను ఏక మొత్తంలో మూకుమ్మడిగా తయారు చేయడం కోసం వివిధ కంపెనీలు, పరిశ్రమల నుంచి ఇస్రో దరఖాస్తులు ఆహ్వానించింది. కరోనా వైరస్పై పోరాటాన్ని తీవ్రతరం చేయడం కోసం భారత్ విదేశాల నుంచి వివిధ రకాల వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లను దిగుమతి చేసుకుంటున్న సమయంలో ఇస్రో నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం.
రాకెట్ల తయారీ, దానికి సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఇస్రో సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) దేశంలోని పలు పరిశ్రమల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. అంతేగాక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తయారీకి సంబంధించిన ప్రత్యేకతలను తన వెబ్సైట్లో షేర్ చేసింది. తాను అభివృద్ధి చేసిన పోర్టబుల్ మెడికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్కు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ SHWASS అని నామకరణం చేసింది.
శ్వాసకోశ సంబంధ అనారోగ్యాలతో బాధపడేవారికి, ఆక్సిజన్ థెరపీ తీసుకుంటున్న వారికి ఇస్రో అభివృద్ధి చేసిన ఈ మెడికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్సన్ (PSA) పద్ధతి ద్వారా పరిసరాల్లోని గాలి నుంచి నత్రజనిని వేరుచేసి ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతాయి. ఈ కాన్సన్ట్రేటర్ల ద్వారా ఏకకాలంలో ఇద్దరు రోగులకు నిరంతరాయంగా ఆక్సిజన్ను అందించవచ్చని ఇస్రో తన వెబ్సైట్లో పేర్కొన్నది.
సహజీవనం ఆమోదయోగ్యం కాదు: పంజాబ్, హర్యానా హైకోర్టు
కొవిడ్పై యుద్ధం ప్రతి ప్రాణాన్ని కాపాడేలా ఉండాలి: ప్రధాని మోదీ