సెకండ్వేవ్ మూలంగా అనేక రాష్ర్టాల్లో థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. దాంతో కోలీవుడ్, బాలీవుడ్తో పాటు పలు భాషలకు చెందిన అగ్రనాయకానాయికలు తమ సినిమాల్ని ఓటీటీలలో విడుదల చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా నయనతార నటించిన తమిళ చిత్రం ‘నెట్రికన్’ త్వరలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది. మిలింద్రావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నయనతార ప్రియుడు విఘ్నేష్శివన్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించబోతున్నది. కొరియన్ చిత్రం ‘బ్లైండ్’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. యాక్సిడెంట్ కారణంగా అంధురాలిగా మారిపోయిన యువతి తన లోపాన్ని అధిగమిస్తూ ఓ సీరియల్ కిల్లర్ను ఎలా ఎదురించి పోరాడిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిస్నీ హాట్స్టార్ ద్వారా త్వరలో ఈ సినిమాను విడుదలచేయబోతున్నట్లు నిర్మాత విఘ్నేష్శివన్ అన్నారు.