వనస్థలిపురం, ఏప్రిల్ 27 : నియోజకవర్గంలోని బస్తీ దవాఖాలను బలోపతం చేసేందుకు కృషి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం హస్తినాపురంలోని బస్తీ దవాఖానను డీఎంహెచ్వో దీన్దయాల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దవాఖాన వద్ద ప్రజలు ఎండలో వేచి ఉండకుండా సొంత ఖర్చులతో టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయిస్తామన్నారు.
దీంతోపాటు నువ్వల బండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బస్తీ దవాఖానలో మరో 10మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. నిత్యం 6వందల మందికి టీకా వేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నందనవనం కాలనీలో టీకా కేంద్రం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ బ్లెస్సీ, నాయకులు అనంతుల రాజిరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, అరుణ్, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.