న్యూఢిల్లీ: భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఉద్యోగులకు శుభవార్త. వారి వేతనాలు 16 శాతం పెరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక సేవల మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్ష మందికి పైగా ఎల్ఐసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. దీంతోపాటు ఇక ఎల్ఐసీ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనివారం కూడా అమలులోకి రానున్నది
ఐటీ రంగ ఉద్యోగుల మాదిరిగానే ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి. తక్షణం ఐదు రోజుల పనివారం అమలులోకి వస్తుంది. ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు ఎంతో కాలంగా ఐదు రోజుల పని విధానాన్ని అమలులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాయి.
అంతేకాదు.. ఎల్ఐసీ ఉద్యోగులు తమ స్థాయిని బట్టి అదనపు స్పెషల్ అలవెన్స్ అందుకోబోతున్నారు. వారికి నెలకు రూ.1500 నుంచి రూ.13,500 వరకు ఈ అలవెన్స్ ద్వారా లబ్ధి చేకూరుతుంది.
అన్ని కేడర్ల ఉద్యోగులకు ఈ అదనపు స్పెషల్ అలవెన్స్ను అమలు చేస్తున్నారు. కరువు భత్యానికి అనుగుణంగా దీన్ని ఖరారు చేశారు. అయితే, సిటీ కాంపన్సేషన్ అలవెన్స్, గ్రాట్యూటీ, హౌస్ రెంట్ అలవెన్స్, పెయిడ్ లీవ్ ఎన్క్యాష్మెంట్ అండ్ సూపర్న్యూమరేషన్ బెనిఫిట్స్ ఇందులో కలుపలేదు.
ప్రతి ఐదేండ్లకోసారి ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాలు పెరుగతాయి. ఇంతకుముందు 2012లో ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. షెడ్యూల్ ప్రకారం 2017లో పెరగాల్సి ఉన్నా పెండింగ్లో పెట్టారు.
దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాలు పెరుగుతున్నాయి. అయితే, ఉద్యోగులు 35 శాతం వేతనాలు పెరుగుతాయని అంచనా వేసినా, కేంద్రం మాత్రం 16 శాతమే పెంచింది.
స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీని లిస్టెడ్ కంపెనీగా చేర్చాలని కేంద్ంర భావిస్తున్నది. దీనికోసం ఐపీవో ప్రక్రియ కొనసాగుతున్నది.
గత ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఎల్ఐసీని లిస్టెడ్ కంపెనీగా మారుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఐపీవో ద్వారా ఎల్ఐసీ వాటాల విక్రయంతో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తున్నది.
స్మార్ట్గా దోపిడీ.. రూ.5 లక్షలు చోరీ
బ్యాంక్ అలర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవలకు బ్రేక్!
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు