కరోనా వలన అందరి పరిస్థితి అయోమయంగా మారింది. పెద్దవాళ్లకు పనిలేక,చిన్న పిల్లలకు స్కూల్ లేక పరిస్థితులు అద్వాన్నంగా మారాయి. కొద్ది రోజులుగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పటికీ వాటి ద్వారా తమ పిల్లల సరైన శిక్షణ పొందలేరని పిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ క్రమంలో విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య అలియా, పిల్లలు షోరా, యానీ దుబాయ్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
దుబాయ్లో స్కూల్స్ తెరచుకోగా, పిల్లలందరు స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో తమ పిల్లల్ని స్కూల్కి పంపించి చదివించాలని అలియా భావిస్తుంది. ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లల ప్రవర్తనలో తేడా వస్తుంది. అందుకే వచ్చే నెల్లో దుబాయ్ వెళ్లిపోవాలనుకుంటున్నాం. మా బంధువులు అక్కడ ఉన్నారు. స్కూల్ అడ్మిషన్స్ వ్యవహారాలు వాళ్లే చూసుకుంటున్నారు. పిల్లల్ని విదేశాల్లో చదివించాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. కరోనా వల్ల అది కాస్త ముందుకు వచ్చింది’ అని ఆమె పేర్కొన్నారు