శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఓ చిరుతపులి కలకలం రేపింది. జమ్ము పరిధిలోని గాంధీనగర్ ఏరియాలోగల గ్రీన్ బెల్ట్ పార్కులో ఇద్దరు వ్యక్తులపై చిరుత అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులు బొలెరో వాహనంలో కొన్ని మొక్కలను తీసుకొచ్చి వాహనం నుంచి కిందికి దిగగానే ఎక్కడి నుంచి వచ్చిందో గానీ చిరుతపులి ఒకరిపై దాడి చేసింది. వెంటనే పక్కనున్న మరో వ్యక్తి కర్రతో కొట్టగా కొంతదూరం వెళ్లి మళ్లీ దాడికి ప్రయత్నించింది. ఇంతలో ఆ ఇద్దరూ వాహనంలోకి ఎక్కి డోర్లు వేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్