లక్ష్యం : రూ. 24.18 కోట్లు
అందించినవి : రూ. 28.60 కోట్లు
లక్ష్యానికి మించి 18. 25 శాతం
బకాయిల వసూళ్లలోనూ ఐదో స్థానం
ఆర్థికంగా బలపడుతున్న మహిళా సంఘాలు
అధికారుల హర్షం
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) :స్త్రీనిధి రుణాల పంపిణీలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 24 కోట్ల 18 లక్షల 99 వేలు లక్ష్యంగా పెట్టుకోగా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా రూ. 28 కోట్ల 60 లక్షల 4 వేలు అందించింది. లక్ష్యానికి మించి 18.25 శాతం ఇవ్వగా, మహిళా సంఘాలు వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీనిధి పథకం ప్రారంభం నుంచి ఆసిఫాబాద్ జిల్లాలో వంద శాతాన్ని మించి రుణాలు అందించడం ఇదే మొదటిసారి. రుణాల మంజూరులో జిల్లా మొదటి స్థానం లో నిలువడంపై స్త్రీ నిధి రీజినల్ కో మేనేజర్ రామగిరి వెం కట రమణ హర్షం వ్యక్తం చేశారు.
లక్ష్యాన్ని మించి రుణాలు
రుణాల పంపిణీని ఈ ఏడాది అనుకున్న దానికంటే ఎక్కువగానే అధికారులు అందించారు. జిల్లా రుణాల లక్ష్యం రూ. 24 కోట్ల 18 లక్షల 99 వేలు ఉండగా, రూ. 28 కోట్ల 60 లక్షల 4 వేలను పంపిణీ చేశారు. లక్ష్యం కంటే 18.25 శాతం అధికంగా ఇచ్చారు.
ఆర్థికంగా బలపడుతున్న మహిళా సంఘాలు
స్త్రీ నిధి ద్వారా తీసుకున్న రుణాలతో మహిళలు వివిధ రకాల వ్యాపారాలు, పిల్లల చదువులు, వైద్యం, తదితరల అత్యవసర సమయాల్లో వ్యక్తిగత రుణాలు పొందుతూ అవసరాలను తీర్చుకుంటూ ఆర్థికంగా బలపడతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న 2365 సంఘాల్లోని 10,770 మంది సభ్యులు రూ. 28 కోట్ల 60 లక్షల 4 వేల ను రుణాలుగా తీసుకున్నారు.
బకాయిల వసూళ్లలో ఐదో స్థానం..
మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాల వసూళ్లలో కూడా జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. జిల్లాలోని 15 మండలాల్లో 7 మండలాలతో పాటు కాగజ్నగర్లోని అర్బన్ మహిళా సంఘం (జీవన జ్యోతి ) కూడా రుణాలను సకాలంలో చెల్లిస్తోంది. బెజ్జూర్, జైనూర్, పెంచికల్పేట్, సిర్పూర్-యు, తిర్యాణి, వాంకిడి మండలాల్లోని మహిళా సంఘాల సభ్యు లు రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నారు. రెబ్బెన, ఆసిఫాబాద్, కాగజ్నగర్, సిర్పూర్-టి, చింతలమానేపల్లి, కౌటా ల, దహెగాం, కెరమెరి, లింగాపూర్ మండలాల్లోని 105 స్వయం సహాయక సంఘాలు తాము పొందిన రుణాలను సక్రమంగా చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు. కాగా ఆ బకాయిల వసూళ్లపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
మొదటి స్థానంలో నిలువడం మొదటిసారి..
స్త్రీ నిధి రుణాల అందజేతలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉండడం ఇదే మొదటిసారి. అదేవిధంగా రాష్ట్రంలోని 24 పట్టణ సమాఖ్యలలో కాగజ్నగర్లోని జీవన జ్యోతి పట్టణ స మాఖ్య కూడా రుణాలు పొంద డం, రికవరీలో కూడా 100 శా తం పురోగతిని సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్త్రీ నిధి రుణాలు రూ. 24 కోట్ల 18 లక్షల 99 వేలు లక్ష్యంగా ఉండగా, రూ. 28 కోట్ల 60 లక్షల 4 వేలను అందించినం. దాదాపు 18 శాతం రుణాలు అధికంగా ఇచ్చాం. అదేవిధంగా బకాయిల వసూళ్లపై కూ డా ప్రత్యేకంగా దృష్టిసారించాం. రికవరీ కూడా 94 శా తం ఉండడం కూడా ఇదే మొదటి సారి.
ఇవి కూడా చదవండి..
సచిన్.. నువ్వు కొవిడ్నూ సిక్స్ కొట్టగలవు: వసీం అక్రమ్
చెన్నై చేరిన డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్
గిఫ్ట్గా వచ్చిన మహీంద్రా థార్ కార్లతో నటరాజన్, శార్దూల్ పోజులు
వారణాసిలో సవాల్.. మోదీపై దీదీ పోటీ!