స్క్రీన్ రైటర్గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో నటుడిగా నిలదొక్కుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులని అలరించడంతో తర్వాత జాతిరత్నం అనే సినిమా చేశాడు. ఇందులో తన కామెడీ టైమింగ్తో కడుపుబ్బ నవ్వించిన నవీన్ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు.
జాతిరత్నం అనేట్టుగానే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ రాబట్టాడు. ఇంతటి క్రేజ్ దక్కించుకున్న నవీన్ పోలిశెట్టి.. ఈ మధ్య పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కాడు. సమీర్ అనే వ్యక్తి కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్నాడని తెలుసుకున్న నవీన్ పోలిశెట్టి తన ట్విట్టర్ ద్వారా హైదరాబాద్లో ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చెప్పండి, అతనికి సాయం చేయండని కోరాడు. ఈ ట్వీట్కు స్పందించిన ఎవోక్ అనే సంస్థ.. ఆ నిరుద్యోగికి సహాయం చేస్తూ ఉద్యోగం ఇచ్చింది.
ఇక నవీన్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం కొన్నాళ్లుగా వైవిధ్యమైన కథలు వింటున్నాడు. జాతిరత్నాలు రైటింగ్ డిపార్ట్ మెంట్ లో కీలకంగా పని చేసిన కళ్యాణ్ అనే కొత్త దర్శకుడు చెప్పిన లైన్ బాగా నచ్చడంతో అతనితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. కాగా, యువి కాన్సెప్ట్ సంస్థ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందించే సినిమాలో నవీన్ హీరోగా నటిస్తున్నట్టు సమాచారం. ఇది పూర్తిగా కొత్త తరహాలో ఉంటుందట.