ముంబై,జూన్ 21: అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలివ్వడంతో ఆసియా మార్కెట్లు ఇవాళ అప్రమత్తంగా కదులుతున్నాయి. వీటితో పాటు దేశీయంగా వాహన, ఆటో వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 51,887.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,197.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,740.19 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,525.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,626.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,505.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.53శాతం అంటే 83.60పాయింట్లు నష్టపోయి 15,601.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
సెన్సెక్స్ 0.50శాతం అంటే 261.63 పాయింట్లు నష్టపోయి 52,109.83 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.41 శాతం, ఎన్టీపీసీ 2.03 శాతం, హెచ్ యుఎల్ 1.01 శాతం, ఏషియన్ పేయింట్స్ 0.72 శాతం, హెచ్ డీఎఫ్సి లైఫ్ 0.63 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్ 4.52 శాతం, టాటా మోటార్స్ 2.57 శాతం, విప్రో 1.87 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.71 శాతం, హిండాల్కో 1.74 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, రిలయన్స్, టాటా మోటార్స్ ఉన్నాయి