సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. అంత ఈజీగా మరిచిపోయే పేరు కాదు ఇది. ఎందుకంటే ఇండియన్ సినిమాపై ఆయన వేసిన ముద్ర అలా ఉంది. కేవలం 34 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఆయన చనిపోయి ఏడాది కావస్తున్న అభిమానులు మాత్రం ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా బాక్సాఫీస్ దగ్గర అవి చేసిన మ్యాజిక్ మాటల్లో చెప్పలేము. ఇక సుశాంత్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ప్రతి సినిమాలోనూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు ఈ కుర్ర హీరో. అలాంటి ఒక అద్భుతమైన నటుడు ఈ రోజు మన మధ్య లేడు. కేవలం బాలీవుడ్లో వారసత్వం కారణంగా సుశాంత్ అర్ధాంతరంగా చనిపోయాడు అంటూ అభిమానులు ఇప్పటికీ మండి పడుతున్నారు. కానీ ఈయన నటించిన చిచోరే సినిమాకు జాతీయ అవార్డు లభించింది. 67 వ జాతీయ అవార్డులు ప్రకటనలో భాగంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చిచోరే సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో జాతీయ అవార్డు వచ్చింది.
దంగల్ లాంటి సంచలన సినిమా తెరకెక్కించిన నితీష్ తివారి దీనికి దర్శకుడు. ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదు అని ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. శ్రద్ధా కపూర్, నవీన్ పొలిశెట్టి, వరుణ్ కీలక పాత్రలో నటించారు. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన చిచోరే దాదాపు 240 కోట్లు వసూలు చేసింది. సుశాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇదే. తాజాగా ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడంతో సుశాంత్ సింగ్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఆయన లేకపోయినా ఆయన సినిమాలు బతికే ఉంటాయి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?