కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వీణవంక జడ్పీటీసీ వనమాల భర్త సాధవరెడ్డికి ఆ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ) గురువారం నోటీసులు జారీ చేసింది. సాధవరెడ్డితోపాటు డైరెక్టర్లుగా పనిచేసిన మరో 12 మందికి నోటీసులు ఇచ్చింది.
ఐదేళ్ల క్రితం సాధవరెడ్డి వీణవంక సొసైటీ చైర్మన్గా పనిచేశారు. ఈయన సొసైటీ చైర్మన్గా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు కేడీసీసీ వెల్లడించింది.
పదిరోజుల్లోగా రూ.16 లక్షలు చెల్లించాని నోటీసుల్లో సూచించింది. నగదు చెల్లించని పక్షంలో ఆస్తులు జప్తు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.