నెపితా: మయన్మార్లో సైన్యం ఆగడాలు హద్దుమీరుతున్నాయి. సైనిక తిరుగుబాటను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్న ఆందోళనకారుల్ని సైన్యం బెదిరిస్తున్నది. చైనాకు చెందిన టిక్టాక్ యాప్తోనూ సైన్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మయన్మార్లో రక్తపాతం ఏరులైపారుతున్న ఈ తరుణంలో సుమారు 800 వీడియోలను సైన్యం అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం నిరసనకారుల్ని టార్గెట్ చేస్తూ ఆ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మయన్మార్లో 54 మంది మృతిచెందినట్లు యునైటెడ్ నేషన్స్ పేర్కొన్నది. ఫిబ్రవరిలో రిలీజైన ఓ వీడియోలో.. సైనికులు బెదిరింపులకు పాల్పడుతున్న విషయాలు బయటపడ్డాయి. ఇవాళ రాత్రంతా నగరంలో పెట్రోలింగ్ చేస్తాను.. నాకు ఎవరు కనిపించినా వాళ్లను షూట్ చేస్తాను.. మీరు వీరమరణం పొందాలనుకుంటే, మీ కోరికను తీరుస్తాను అంటూ ఓ సైనికుడు తన టిక్టాక్ వీడియోలో పేర్కొన్నట్లు గుర్తించారు. చేతిలో గన్ పట్టుకుని నిరసనకారులకు బెదిరింపులు ఇచ్చిన ఆ సైనికుడు ఎవరో ఇంకా బయటకు రాలేదు.