పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని తన సహజమైన నటనతో నేచురల్ స్టార్గా మారాడు. ఆయనకు ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది.ఇప్పుడు నటుడిగానే కాకుండా నిర్మాతగాను రాణిస్తున్న నాని వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ను స్టార్ట్ చేసి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఈ బేనర్లో తొలి చిత్రంగా అ! అనే మూవీ నిర్మించాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది.
ఆ తర్వాత హిట్ అనే సినిమాని నిర్మించగా ఇది మంచి విజయం సాధించింది. శైలేష్ కొలను ఈ చిత్రంతోనే దర్శకుడిగా మారాడు. అయితే తన బేనర్ ద్వారా కొత్త దర్శకులని పరిచయం చేస్తున్న నాని .. ఇప్పుడు ‘మీట్ క్యూట్’ ద్వారా దీప్తి గంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. ఐదు కలల సంకలనంగా చిత్రాన్ని రూపొందిస్తుండగా, ఇందులో ఆరుగురు హీరోలు, ఆరుగురు హీరోయిన్స్ ఉంటారట.
ఈ అంథాలజీలో రోహిణి, ఆదాశర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునైన, సంచితా పూనాంచ, అశ్విన్కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ఇలా వేర్వేరు భాషలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.
మరో వైపు నాని హిట్ సీక్వెల్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిట్ టీమ్ ఆఫీసర్ కె.డి.తో కలిసి టెన్షన్తో గోళ్లు కొరికేసుకునేంత ఉత్కంఠతకు లోను చేసే జర్నీని చేయబోతున్నారు అని నాని గతంలో తన ట్వీట్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.