కరోనా వచ్చిన్పపటి నుండి సినీ పరిశ్రమలో గడ్డు కాలం నెలకొంది. థియేటర్లో విడుదల కావలసిన సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చినా కూడా పెద్ద ఇష్యూ జరగలేదు. కాని టక్ జగదీష్ విషయంలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నాం అని నాని, నిర్మాతలు ప్రకటించగా, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్సిసి) మండిపడింది.
నానిపై దారుణమైన కామెంట్స్ చేయడం, ఆ తర్వాత సారీ చెప్పడం జరిగాక టక్ జగదీష్ చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్స్ సంస్థ తాజాగా ఓ ప్రకటనలో క్షమాపణలు కోరింది. రెండున్నరేళ్ల క్రితమే సినిమా ప్రారంభమైంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడింది. కష్టంలో ఉన్నాం. అందుకే ఇప్పుడు ఓటీటీ బాటలో వెళుతున్నామని నిర్మాతలు తెలిపారు. తాము ముందే హీరో నాని అనుమతి తీసుకున్నాం.
ఆయన కొన్ని రోజులు ఆగుదామని చెప్పారు. అయినప్పటికీ పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో దర్శకులు, నాని నిర్మాతల పరిస్థితులు అర్ధం చేసుకున్నారు. పరిస్థితులతో పాటు మమ్మల్ని కూడా అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాం అని షైన్ స్క్రీన్స్ సంస్థ తెలిపింది. ఓవరాల్ గా నాని టక్ జగదీష్ సెప్టెంబర్ 10న ఓటీటీలో విడుదలైపోతోంది. అదే రోజు లవ్ స్టోరీ చిత్రం థియేటర్స్లో విడుదల కానుంది.