అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ జిల్లాలో దారుణం జరిగింది. వృద్ధురాలి వద్ద ఉన్న నగలను దోచుకొని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడో ప్రబుద్ధుడు. గుర్తించిన స్థానికులు అతడిని చావబాది పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి ఓ వృద్ధురాలి వద్ద నగలను, నగదును లాక్కొని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.
వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చావబాదారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. పలువురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.