కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ, ఏప్రిల్ 23 : సాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ను ఎన్నికల నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్యభవన్లో ఓట్ల లెక్కింపుపై నిర్వహించిన శిక్షణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మే 2న నల్లగొండలోని స్టేట్వేర్ హౌజింగ్ కార్పొరేషన్లో లెక్కింపు చేపడుతున్నందున కౌంటింగ్ జరిగే రోజు సిబ్బంది మొత్తం సకాలంలో హాజరుకావాలని సూచించారు. కొవిడ్ నిబంధనల ఆధారంగా కౌంటింగ్ చేపడుతూ రెండు హాళ్లల్లో హాలుకు ఏడు టేబుళ్ల చొప్పున 14 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి ఆ తర్వాత ఈవీఎంల్లో పోలైన ఓట్లు లెక్కించనున్నట్లు తెలిపారు.
మొత్తం 25రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రౌండ్లో లెక్కించిన కంట్రోల్ యూనిట్లలో ఎన్నికల పరిశీలకులు ర్యాండమ్గా రెండు మిషన్లలో ఫలితాలు పరిశీలిస్తారని అన్నారు. వీటికి అదనంగా పరిశీలకులు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఎంపిక చేసిన ఐదు పోలింగ్ స్టేషన్లలోని వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆర్వోలకు, ఏఆర్వోలకు మాస్టర్ ట్రైనర్ తరాల పరమేశ్ పవర్ పాయింట్ ద్వారా లెక్కింపునకు సంబంధించిన ప్రజెంటేషన్ చేశారు. సమాశంలో మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్సింగ్, శిక్షణ నోడల్ అధికారి రాజ్కుమార్, ఏఓ మోతీలాల్ పాల్గొన్నారు.