నాని కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. చిత్రీకరణ పూర్తయింది. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నది. గురువారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ‘కోల్కతా నేపథ్యంలో సాగే పీరియాడికల్ కథాంశమిది. ఈ చిత్రంలో నాని బెంగాలీ యువకుడు శ్యామ్సింగరాయ్గా, వాసుగా భిన్న కోణాలున్న పాత్రలో కనిపిస్తారు’ అని చిత్రబృందం తెలిపింది. రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినవ్ గోమఠం, జిషూసేన్గుప్తా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్, నిర్మాత: వెంకట్ బోయనపల్లి, దర్శకుడు: రాహుల్ సంకృత్యాన్.