ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీపై పగబట్టిందా అనిపిస్తుంది. ప్రతి రోజు ఎవరో ఒకరు కరోనాతో కన్నుమూస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూయగా, ఆయన మరణ వార్త మరచిపోక ముందే మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. దర్శకుడు, రచయిత అయిన నంద్యాల రవి ఈ రోజు ఉదయం కరోనాతో కన్నుమూసారు. కొద్ది రోజుల క్రితం కొవిడ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయిన నంద్యాల రవి పరిస్థితి ఈ రోజు విషమించి తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి సెలబ్స్ నివాళులు అర్పిస్తున్నారు.
‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో ప్రయాణం మొదలు పెట్టిన నంద్యాల రవి ఆరేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ కుమార్ కొండా తీసిన ‘ఒరేయ్ బుజ్జిగా’తో రచయితగా మారాడు. ఈ మధ్యే వచ్చిన ‘పవర్ ప్లే’కు సైతం స్క్రిప్ట్ రైటర్గా పని చేశాడు. కరోనా వలన కొద్ది రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆయన ఆసుపత్రి ఖర్చు 7 లక్షల వరకు అవుతుందని ఇటీవల వార్తలు రాగా, వెంటనే స్పందించిన కమెడీయన్ సప్తగిరి లక్ష రూపాయలు సాయం చేశాడు. నంద్యాల రవి ఇలా అకాల మరణం చెందడం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.