హైదరాబాద్: బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన సేవలందించారని చెప్పారు. ఆయన మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటన్నారు. దిలీప్కుమార్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాలీవుడ్ మేటి నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. దిలీప్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో తరతరాలకు ఎందరో నటులను తీర్చిదిద్దడంలో దిలీప్ కుమార్ స్ఫూర్తిగా నిలిచారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నో అద్భుత, మధుర జ్ఞాపకాలను అందించిన దిలీప్ సాహెబ్కు ఆయన తన ట్వీట్లో థ్యాంక్స్ తెలిపారు.
98 ఏళ్ల దిలీప్ కుమార్ ఇవాళ ముంబైలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మొఘల్ ఏ ఆజమ్, దేవదాస్, అందాజ్ లాంటి ఫేమస్ చిత్రాల్లో ఆయన నటించారు. 1950, 60 దశకంలో ఆయన సూపర్స్టార్ హీరోగా కీర్తికెక్కారు.