మన హీరోలు రీల్ లైఫ్లోనే కాక రియల్ లైఫ్లోను గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నారు. తాజాగా ఓ చిన్నారికి క్యాన్సర్ చికిత్స చేయించేందుకు బాలయ్య ముందుకు వచ్చారు.
మల్కాజ్ గిరికి చెందిన మణిశ్రీ అనే ఒక చిన్న పాప క్యాన్సర్ వ్యాధితో బసవతారకం హాస్పిటల్ లో చేరింది. మణిశ్రీ ఆపరేషన్ కోసం 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయంతో లక్షా 80 వేల వరకూ డబ్బులు సేకరించారు. మిగతా మొత్తం సర్ధుబాటు చేయలేని పరిస్థితులలో మణిశ్రీ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో బాలకృష్ణ అభిమాని సంఘం అధ్యక్షుడిని కలిసి పరిస్థితిని వివరించారు.
బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మణిశ్రీ వ్యాధి గురించి.. ఆపరేషన్య విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్ళాడు. వెంటనే బాలకృష్ణ స్పందించి పాపా ఆపరేషన్ కు కట్టాల్సిన 5 లక్షల 20 వేల రూపాయలు మాఫీ చేయించారు. అంతేకాదు చిన్నారికి తగిన చికిత్స అందించమని వైద్య సిబ్బందికి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు సంతోషం తెలియజేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.