ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
పలు గ్రామాల్లో పర్యటన
ఓదెల, ఏప్రిల్ 5: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కోరారు. కొలనూర్ దవాఖానను ఎమ్మెల్యే సోమవారం సందర్శించి, కరోనా వ్యాక్సినేషన్ను పరిశీలించారు. దవాఖానలో సౌకర్యాలను డాక్టర్ దీప్తిని అడిగి తెలుసుకున్నారు. కొలనూర్ దవాఖాన అభివృద్ధికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నిషీయన్ పోస్ట్ భర్తీ, దవాఖాన ప్రహరీ నిర్మాణానికి స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట ఐరెడ్డి వెంకటరెడ్డి, గుండేటి ఐలయ్యయాదవ్, ఢిల్లీ శంకర్, కావటి రాజు, బండారి ఐలయ్య, కొప్పుల రవి, వెంకటేశ్ ఉన్నారు.
చెక్ డ్యామ్లతో సస్యశ్యామలం
సుల్తానాబాద్రూరల్, ఏప్రిల్ 5: చెక్ డ్యామ్ల నిర్మాణాలతో గ్రామాలు సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. నీరుకుళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని మానేరు వాగులో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి సోమవారం పరిశీలించి, పలు సూచనలు చేశారు. సెక్యూరిటీ వాల్స్ను ఎలా నిర్మిస్తే బాగుంటుందని అధికారులతో చర్చించారు. ఎమ్మెలే వెంట ఎంపీపీ బాలాజీరావు, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, సర్పంచ్ కోటగిరి విజేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాల రామారావు తదితరులున్నారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్5: పెద్దపల్లి మండలం మూలసాలలో రూ.16.20 లక్షల ఎస్డీఎఫ్ నిధులు, కాసులపల్లిలో రూ.26.30 లక్షల ఎస్డీఎఫ్, సీడీపీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పెద్దపల్లి ఏఎంసీ చైర్మన్ బానోతు శంకర్ నాయక్, పెద్దపల్లి, అప్పన్నపేట విండో చైర్మన్లు మాదిరెడ్డి నర్సింహారెడ్డి, దాసరి చంద్రారెడ్డి, సర్పంచులు దాసరి పద్మ, ఎనగందుల శంకరయ్య, ఎంపీటీసీ మందల సరోజిని, మాజీ సర్పంచ్ మందల రాంరెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్టినేటర్ ఇనుగాల అనంత రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి సుధాకర్రెడ్డి, నాయకులు బరిగెల ప్రభాకర్, ఇనుగాల ప్రభాకర్, సంజీవరెడ్డి, సదయ్య, రవీందర్, మామిడి కొమురయ్య, శ్రీనివాస్, శంకర్ తదితరులున్నారు.
పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో రూ.30లక్షల ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తీగల సదయ్య, ఎంపీటీసీ గుర్రాల లక్ష్మి, ఉప సర్పంచ్ హైమావతి, నాయకులు గుర్రాల గట్టేశం, మాధవరావు, బయ్య కొమురయ్య యాదవ్, గుర్రాల సాయిలు తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం