నాగశౌర్య, షిర్లే సేతియా జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. అనీష్కృష్ణ దర్శకుడు. ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత్ర తాజా షెడ్యూల్ను ప్రారంభించారు. నిర్మాత మాట్లాడుతూ ‘కుటుంబ బంధాలకు రొమాన్స్, వినోదాన్ని జోడిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సీనియర్ నటి రాధిక ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం నాయకానాయికలతో పాటు ప్రధాన తారాగణంపై హైదరాబాద్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. వెన్నెల కిషోర్, రాహుల్రామకృష్ణ, సత్య కామెడీ ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్.