నిజామాబాద్ : జిల్లాలోని నవీపేట మండల కేంద్రానికి చెందిన మేక పద్మ(56) బ్లాక్ ఫంగస్తో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సదరు మహిళకు ఈ నెల మొదటి వారంలో కరోనా పాజిటివ్ రాగా వారం రోజుల్లో కోలుకున్నారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆమెకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కన్పించడంతో కుటుంబీకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు బ్లాక్ఫంగస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు రిఫర్ చేశారు.
అయితే కుటుంబ సభ్యులు ఆమెను నవీపేటకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు నాలుగేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పోలీసులమని బెదిరించి.. బంగారం దోచుకెళ్లిన దుండగులు
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
బాధ్యతగా పని చేయండి : మంత్రి హరీశ్ రావు
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయం