అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా..ఆ తర్వాత సడెన్ గా ఆగిపోయింది. నాగార్జున, ప్రవీణ్ సత్తారు మధ్య వచ్చిన సృజనాత్మక విభేధాల కారణంగా షూటింగ్ నిలిచినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది.
నాగ్ సూచనలకు అనుగుణంగా ప్రవీణ్ సత్తారు స్క్రిప్ట్లో మార్పులు చేయగా..ప్రస్తుతానికి ఇద్దరు సినిమాను తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారని లేటెస్ట్ టాక్. అంతేకాదు వచ్చే వారమే ఈ ఇద్దరి ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందట. కలువు కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. స్పై డ్రామాగా యాక్షన్ అండ్ అడ్వంచర్ కథాంశంతో సినిమా సాగనుంది. వైల్డ్ డాగ్ తర్వాత నాగార్జున నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
గోవా బీచ్లో కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్.. ఫోటోలు వైరల్
రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!