రైతు కుటుంబాలకు రూ.5లక్షల బీమా
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
బొక్కలోనిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్18: కేంద్రంలోని బీజేపీ సర్కారు 21 రాష్ర్టాలలో పాలిస్తున్నదని, ఎక్కడా ఉచితంగా కరెంట్ ఇవ్వడం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రైతులు నిజాయితీ పరులు, ఎవరినీ మోసం చేయరు.. కష్టం చేసి అన్నం పెట్టే వారిని మనం గౌరవించుకోవాలని మంత్రి అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా బొక్కలోనిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. 2014కి ముందు రైతులకు విలువలేని పరిస్థితి ఉండేది.. తెలంగాణ వచ్చాక వారి గౌరవం పెరిగడంతోపాటు భూములకు ధరలు పెరగాయని తెలిపారు. ఎండాకాలంలో కూడా రెండు పంటలు ఇక్కడి రైతు పండిస్తున్నారని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వ జనరల్ దవాఖానలో అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, శ్రీనివాస్యాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, రూరల్ తాసిల్దార్ కిషన్, డీఎస్వో వనజాత, ఏడీ వెంకటేశ్ , సర్పంచ్ రాజు, తిరుపతయ్య, డైరెక్టర్ పద్మమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మండలాధ్యక్షుడు దేవేందర్రెడ్డి, పాండురంగారెడ్డి, రాఘవేందర్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!