శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్స్టోరీ’. నారాయణ్దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మాతలు. ఏప్రిల్ 16న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్రంలోని ‘ఏవో ఏవో కలలే..ఎన్నో ఎన్నో తెరలే..అన్నీ దాటె మనసే’ అనే గీతాన్ని అగ్రహీరో మహేష్బాబు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యాన్నందించిన ఈ పాటకు పవన్ సి.హెచ్ స్వరాల్ని సమకూర్చారు. జోనితగాంధీ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్, నిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల.