పైకి కనిపించడు కానీ మెగా బ్రదర్ నాగబాబులో చాలా పెద్ద మీమర్ ఉన్నాడు. ఈయన నటుడు అయిపోయాడు కానీ అలా కాకుండా మీమ్స్ చేయడం కానీ మొదలుపెడితే చాలా మంది నవ్వుకుని చచ్చిపోయేవాళ్లు. పైగా ఈయన వేసే సెటైర్లు కూడా అలాగే ఉంటాయి. ఎవర్ని టార్గెట్ చేయాలనుకుంటున్నాడో వాళ్లపై చాలా సైలెంట్ గా సెటైర్లు వేసి చేతులు దులిపేసుకుంటాడు ఈయన. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నాగబాబు చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాడు. తాజాగా ఒక నెటిజన్ నాగబాబును మీ వాట్సాప్ డిపీ ఏంటి సర్ అని అడిగాడు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ వాట్సాప్ డిస్ ప్లే పిక్చర్ చూపించండి అంటూ అడిగాడు.
దానికి నాగబాబు కూడా ఓకే అన్నాడు. అయితే ఆయన వాట్సాప్ డీపీ చూసిన తర్వాత అంతా ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయారు. ఎందుకంటే కలలో కూడా ఊహించని ఫోటో ఆయన పెట్టుకున్నాడు. తన కూతురో.. అల్లుడో.. కొడుకు ఫోటోనో పెట్టుకుంటాడేమో అనుకున్న వాళ్లకు నాగబాబు ఇచ్చిన షాక్ తో పిచ్చెక్కిపోయింది. ఈయన ఏకంగా బాలకృష్ణ, రామ్ గోపాల్ వర్మ కలిసి దిగిన ఫోటోను వాట్సాప్ డీపిగా పెట్టుకున్నట్లు చెప్పాడు నాగబాబు. అదే ఫోటోను షేర్ చేసాడు కూడా. అయితే నాగబాబు నిజంగానే బాలకృష్ణ, వర్మ ఫోటో పెట్టుకున్నాడా లేదంటే అప్పటికి సందర్భానుసారంగా సెటైర్ వేసాడా అనేది సస్పెన్స్.
ఎందుకంటే అప్పట్లో బాలయ్య ఎవరో తనకు తెలియదు అని చెప్పాడు నాగబాబు. అలాంటి మెగా బ్రదర్ ఇప్పుడు బాలయ్య ఫోటోను డీపీగా పెట్టుకోవడం విడ్డూరంగానే ఉంటుంది. బాలయ్య, వర్మ ఇద్దర్నీ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళపై కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. బాలయ్య, వర్మ కలిసున్న ఫోటోనే తన వాట్సాప్ డీపీ అని నెటిజన్లకు చూపించాడు. ఏదేమైనా ఈయన చేసిన పనికి కొందరు నవ్వుకుంటుంటే.. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం కావాలనే కెలుకుతున్నాడంటూ ఫైర్ అవుతున్నారు.