కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ నెల 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి చిరంజీవి, ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో సినిమా మంచి విజయం సాధించడంతో సక్సెస్ మీట్ నిర్ణయించాలని భావిస్తున్నారు మేకర్స్..
ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని ట్రిడెంట్ హోటల్లో సక్సెస్ మీట్ జరగనుంది.ఈ కార్యక్రమానికి నాగార్జున, సుకుమార్ చీఫ్ గెస్ట్లుగా రాబోతున్నట్టు తెలుస్తుంది. లవ్ స్టోరీ చిత్రంలో ప్రేమకథను కుల వివక్ష .. లింగ వివక్ష అనే అంశాల చుట్టూ అల్లుకుంటూ వెళ్లాడు. ఆ పాయింట్ ను బలంగా జనంపై రుద్దకుండా సున్నితంగా .. అందంగా చెప్పుకుంటూ వెళ్లాడు శేఖర్ కమ్ముల.
బలమైన కథాకథనాలకి తోడు మనసుకు హత్తుకునే పాటలు, చైతూ- సాయిపల్లవి డాన్స్ సినిమా సక్సెస్లో సగభాగం అయింది. సారంగదరియా పాట సినిమాపై ఎన్నో అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. లవ్ స్టోరీ చిత్రానికి పోటీగా మరే సినిమా లేకపోవడంతో ఈ చిత్రం మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది.